సౌత్కొరియాకు చెందిన శామ్సంగ్ సంస్థ త్వరలో సాంసంగ్ గెలాక్సీ A52 పేరుతో 5G స్మార్ట్ఫోన్ను విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన గీక్బెంచ్ వెబ్సైట్లో కనిపించింది. ఈ నివేదిక ప్రకారం. గెలాక్సీ ఏ52లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ను వినియోగించనున్నారు.గెలాక్సీ ఎ 52 5జి ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై నడుస్తుంది. ఇది 6 జిబి ర్యామ్, 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ను వినియోగించారు.గెలాక్సీ ఎ51 5జి స్మార్ట్ఫోన్కు సక్సెసర్గా గెలాక్సీ ఏ52 5జి మోడల్ను తీసుకొస్తున్నారు.
రాబోయే సాంసంగ్ స్మార్ట్ఫోన్ గీక్బెంచ్ నివేదిక ప్రకారం.. ఇది సింగిల్-కోర్లో 298 పాయింట్లు మరియు మల్టీ-కోర్ లో 1,001 పాయింట్లను సాధించింది. GSMArena వెబ్సైట్ సూచించినట్లుగా.. గెలాక్సీ A51 5G ఈ విభాగాలలో సింగిల్-కోర్లో 700 పాయింట్లు మరియు మల్టీ-కోర్ పరీక్షలో 1,800 పాయింట్లతో మెరుగ్గా పనిచేస్తుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎ 52 5జిలో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో కూడిన క్వార్డ్ కెమెరా సెటప్ ఉంటుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎ 52 4జీ ఎల్టీఈ వేరియంట్లో లభించే అవకాశం ఉంది.
సాంసంగ్ ఎ సిరిస్ ఫోన్లకు అధునాత ఫీచర్లు



0 Comments